HomeHEALTHనిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా..

నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికుల ధర్నా..

దీపావళి సమీపిస్తున్నప్పటికీ సరైన వేతనాలు అందకుండా నిర్లక్ష్యానికి గురవుతున్నామని ఆరోపిస్తూ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులు ఏఐటీయూసీ (AITUC) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కార్మికుల వేతనాలు నిలిచిపోవడం పూర్తిగా ఆసుపత్రి అధికారులు మరియు సంబంధిత శాఖల నిర్లక్ష్యమేనని నాయకులు మండిపడ్డారు. పండుగ సందర్భంలో కూడా వేతనాలు చెల్లించకపోవడం అమానుషమని వారు పేర్కొన్నారు.

అలాగే, జిల్లాలోని పలు ప్రాంతాల్లో పని చేయాల్సి రావడంతో కార్మికులపై పనిభారం అమితంగా పెరిగిందని, దీనిని పరిగణలోకి తీసుకుని వేతనాలను పెంచాలని వారు డిమాండ్ చేశారు.

ప్రభుత్వ ఆసుపత్రిని త్వరగా 1000 పడకల ఆసుపత్రిగా విస్తరించాలని, కార్మికులకు ఇతర చోట్ల తిప్పకుండా ఒకే ప్రదేశంలో స్థిర ఉపాధి కల్పించాలని కూడా నాయకులు హితవు పలికారు.

ఈ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్‌కు ఏఐటీయూసీ ప్రతినిధులు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments