ఆసుపత్రి యాజమాన్యం నుంచి బలవంతంగా డబ్బులు చేసిన కేసులో అయిదుగురు జర్నలిస్టు ల మీద కేసు నమోదు చేసి నట్లుగా ఒకటో టౌన్ యస్ హెచ్ వో రఘుపతి తెలిపారు. 13న సావిత్రి అనే మహిళ బీపీ తోటి అమృత లక్ష్మీ ఆసుపత్రి నందు జాయిన్ చేయగా ట్రీట్మెంట్ పొందుతూ 16 న మృతి చెందింది .
ఇవిషయమై కుటుంబ సభ్యులు హాస్పటల్ యాజమాన్యానికి మధ్య డబ్బుల విషయంలో వివాదం తలెత్తింది అదే సమయంలో అహ్మద్ (అక్షర విజయ) మరియు ప్రమోద్ లు మరో ముగ్గురు విలేకర్ల ఐన శ్రీనివాస్ మల్లెపూల నవీన్ వంశీ తో కలిసి అక్కడికి వెళ్లి వాళ్లు ఇష్యుని సెటిల్ చేసినట్టుగా చేసి హాస్పిటల్ యాజమాన్యానికి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు తీసి అవి పబ్లిష్ చేస్తామని సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించి హాస్పిటల్ యొక్క పేరుని బదనాం చేస్తాం అంటూ భయపెట్టారని ఆయన తెలిపారు పదివేల రూపాయలు డిమాండ్ చేయగా హాస్పిటల్ యాజమాన్యం భయపడి వాళ్లకి రూపాయలు రూ పది వేలు ఇచ్చారు .
దీనిపై ఆసుపత్రికి చెందిన బాద్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఈరోజు అహ్మద్ ప్రమోద్ అనే ఇద్దరు విలేకరులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా మేజిస్ట్రేట్ గారు వాళ్లకి 7 రోజుల రిమాండ్ విధించగా వారిని నిజామాబాదు జైలు కు తరలించామని ఆయన వివరించారు
