నాగిరెడ్డిపేట మండలం చీనూరు గ్రామానికి చెందిన రైతు రంగి యేసయ్య(44) శనివారం మంజీరా నదిలో పడి మృతి చెందినట్లు నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపారు.
మంజీరా నదిలో కరెంటు మోటార్ ను బయటకు తీయడానికి చేస్తున్న ప్రయత్నంలో ప్రమాదవశాత్తు నదిలో పడి మృతి చెందినట్టు అతని భార్య పద్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు .
