జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీ ఎత్తున బదిలీలు జరిగాయి. పోలీస్ శాఖలో పరిపాలనాపరమైన మార్పులు చేపడుతూ కమిషనర్ సాయి చైతన్య శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా ఒకే చోట విధులు నిర్వహిస్తున్న వారితో పాటు, పనితీరు ఆధారంగా మొత్తం 196 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.కమిషనరేట్ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న వారిలో అత్యధికంగా కానిస్టేబుల్ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు.
కానిస్టేబుల్స్:112 మంది
హెడ్ కానిస్టేబుల్స్:66 మంది
ఏఎస్ఐలు: 18 మంది
నీ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారందరూ తక్షణమే తమకు కేటాయించిన కొత్త బాధ్యతల్లో చేరాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సీపీ స్పష్టం చేశారు.
