హైదారాబాద్ శివారు లో ప్రమాదం ….ఆరుగురు మృతి @@@@@@ హైదరాబాద్ లో శంషాబాద్ పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నెంబర్ 16 దగ్గర ఆగి ఉన్న ఓ లారీని.. వెనుక నుంచి వచ్చిన కారు అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు . కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో.. ఆరుగురు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది.మృతులంతా శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆసుపత్రికి తరలించారు.
