నిజామాబాద్ జిల్లా జానకంపేట శివారులో ఒక అమానుష ఘటన వెలుగు చూసింది.పని ఇప్పిస్తానని నమ్మబలికి, ఒక మహిళను ఆటోలో ఎక్కించుకుని తీసుకెళ్లి దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ ఘటన ఎడపల్లి మండల పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే నగరంలోని గోల్ హనుమాన్ ప్రాంతంలో దాదాపు 42 నుంచి 45 ఏళ్ల వయసు గల మహిళను ఆటో డ్రైవర్ తన ఆటోలో ఎక్కించుకున్నాడు.నీకు పని ఇప్పిస్తాను” అని నమ్మబలికి, ఆమెను జానకంపేట శివారులోని ప్రాంతానికి తీసుకెళ్లాడు.
అక్కడ ఆమెపై అఘాయిత్యం చేయడానికి యత్నించగా, సదరు మహిళ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ ఆమె చెవిని కొరికి, బండరాయితో తలపై దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
బాధితురాలు ప్రస్తుతం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ఈ సంఘటనకు చెందిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
