పొలీస్ శాఖ ఆప్రాంతం అయింది సైబరాబాద్ పరిధిలో పని చేసే ఐటీ, ఇతర ఉద్యోగులు అందరూ త్వరగా ఇళ్లకు వెళ్లిపోవాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ చేస్తున్నారు భారీ వర్షంతో ట్రాఫిక్ రద్దీ, ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశం ఉండటంతో.. మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల నుంచే విడతల వారీగా అందరూ ఇళ్లకు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు.
ఐటీ సెక్టార్ లైన గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, హైటెక్ సిటీ, శేరిలింగంపల్లి, చందానగర్, పటాన్ చెరు, నార్సింగ్, అమీన్ పూర్, కూకట్ పల్లి, కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, ఆర్సీ పురం ఏరియాలలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు మధ్యాహ్నం 3.30 గంటల నుంచే ఉద్యోగులకు దశలవారీగా ఎర్లీ లాగౌట్లు కల్పించాలని సైబరాబాద్ పోలీసులు అన్ని కంపెనీల యాజమాన్యాలకు సూచన చేశారు.
