నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకార.. వేంపల్లి శివారులోని బైపాస్ వద్ద లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయాలతో బయట పడ్డారు. ఆర్మూర్ నుంచి నిర్మల్ వైపు సంత్రాల లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
