ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు వేయడం జరిగిందని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఒక ప్రకటనలో తెలిపారు.
కీలక అంశాలపై ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం ఉండడంతో ఈ నెల 20న జరగాల్సిన ప్రజావాణిని రద్దు చేశామని అన్నారు. ఈ నెల 27వ తేదీ నుంచి తిరిగి యధావిధిగా ప్రతి సోమవారం ప్రజావాణి కొనసాగుతుందని తెలిపారు.
