సొసైటీ ఫర్ సివిల్ లీగల్ ఎయిడ్స్ ఛైర్మన్ అడ్వకేట్ మీర్ ఖుర్రం అలీ వెల్ఫేర్ ఇండియా సోషల్ వెల్ఫేర్ ఫెడరేషన్ వ్యవస్థాపకుడు సయ్యద్ తాహేర్ హుస్సేన్ తో కలిసి తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్. సురేందర్ రెడ్డి గారిని మరియు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా వెల్కేర్ ఇండియా నేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్–2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని శ్రీ సురేందర్ రెడ్డి గారిని అధికారికంగా ఆహ్వానించారు.ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.
న్యాయ అవగాహన, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, న్యాయవాదుల సంఘం మరియు సామాజిక సేవా సంస్థల మధ్య పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.ఈ సమావేశంలో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు
అడ్వకేట్ పి. శ్రావణ్ కుమార్ (కార్యదర్శి), అడ్వకేట్ కె. నిరంజన్ రెడ్డి (కార్యదర్శి), అడ్వకేట్ బాలాజీ బనోత్ (కోశాధికారి), అడ్వకేట్ వి. వర్ధన్ జయసూర్య (క్రీడలు & సాంస్కృతిక కార్యదర్శి), శ్రీ పి. నాయక్ రామావత్ (మాజీ కార్యవర్గ సభ్యుడు)తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రతినిధి బృందం తమకు ఆత్మీయ స్వాగతం పలికిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలంగాణ న్యాయవాదుల సేవలు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించింది.
