ఎల్బీనగర్ ఏసీపీ ఆఫీస్ ఫై ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు మూకుమ్మడిగా దాడి చేసారు మృతుడి కుటింబీకుల తో మాట్లాడడానికి ఏసీపీ అందుబాటులోకి రాకపోవడంతో వారిలో ఆగ్రహం పెల్లుబికింది.
కానిస్టేబుల్ సాయికుమార్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఏసీపీ కార్యాలయంలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేసారు. కుటుంబ సభ్యులను సముదాయించడానికి స్థానిక సీఐ ప్రయతించారు
ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడం తో పోలీసులు భారీగా మోహరించారు
