ఆర్టీసీ డ్రైవర్ల కేసుల పై పునర్ సమీక్ష ఆర్టీసీ డ్రైవర్ల కేసుల పై నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పునః సమీక్ష నిర్వహించారు.
కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ డ్రైవర్ల పై గల కేసులను సమీక్షించారు.
స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు, ఆర్టీసీ డ్రైవర్ తప్పుంటేనే మాత్రము వారిపై కేసులు పెట్టాలి, లేకపోతే ఎట్టి పరిస్థితిలో వారిపై కేసులు పెట్టరాదని సూచించినారు.
ఈ కార్యక్రమంలో .కోటేశ్వర రావు, డి.సి.పి (అడ్మిస్), , టి. నారాయణ ఏ.సి.పి ట్రాఫిక్, ఆర్టీసీ అధికారులు కె.జానీరెడ్డి RMO, వి.శంకర్ Dy.RMO, M. సరస్వతి Dy.RMO, బి. ఎస్. ఆనంద్ నిజామాబాద్ డిపో 1 & 2 మేనేజర్, పి.రవికుమార్ ఆర్మూర్ డిపో మేనేజర్, ఎం శ్రీనివాస్ బోధన్ డిపో మేనేజర్ లు హాజరైనారు, వీరితోపాటు ఆర్టీసీ కేసులు గల సంబంధిత పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు హాజరయ్యారు.
