అనుకున్నదే జరిగింది ….పోలీసుల ఆంక్షల వ్యూహం తుస్సుమంది. చెప్పినట్లుగానే రైతులు పెద్దఎత్తున ఆర్మూర్ కు తరలి వచ్చారు. మామిడి పల్లి చౌరస్తా కు వందలాది గా రైతులు చేరుకున్నారు.
వందలాది పోలీసులబలగాలు జాతీయ రహదారి మీద మోహరించాయి.ప్రభుత్వ నుంచి స్పష్టం అయిన ప్రకటన వచ్చే దాక రోడ్డు మీద బైఠాయించాలని ఐక్య కార్యాచరణ కమిటీ తెగేసి చెప్తుంది.
షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మూడు నియోజకవర్గాల రైతులు శనివారం ఛలో ఆర్మూర్ కు పిలుపు నిచ్చారు.
నిజామాబాద్ రూరల్ బాల్కొండ ఆర్మూర్ సెగ్మెంట్ లకు రైతులను తరలించాలని ఐక్య కార్యాచరణ సమితి పిలుపు నిచ్చింది .
