Monday, April 20, 2026
HomeTelanganaHyderabadవర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ అత్యవసర సమీక్ష.. సీనియర్ మంత్రులతో ఫోన్లో రివ్యూ...

వర్షాలపై సీఏం రేవంత్ రెడ్డి అలెర్ట్ అత్యవసర సమీక్ష.. సీనియర్ మంత్రులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేసిన సీఎం రేవంత్

భారీ వర్షాలతో అతలాకుతులం అవుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం అయ్యారు.

భారీవర్షాలున్న జిల్లాల మంత్రులతో ఆయన ఫోన్ లోనే రివ్యూ చేశారు. అప్రమత్తం వుంటూ యంత్రాంగానికి దిశా నిర్దేశం చేయాలని కోరారు .

సీఎస్, డీజీపీ, మున్సిపల్, కరెంట్, పంచాయతీ రాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలి కాన్ఫరెన్స్ లో ఆదేశించారు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలనిఅధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు

చేసుకొని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం ఆదేశించారు అత్యవసర విభాగాల అధికారులు క్షేత్ర స్థాయిలో అంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఏంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశం వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్న సీఎం

అత్యవసర పనుకుంటే తప్పా ప్రజలు బయటకి రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా అంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని సూచించిన ముఖ్యమంత్రి రేవంత్*మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశం

24 గంటలు అలెర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగంగా కావాలని కాంగ్రెస్ కార్యకర్తలను రేవంత్ కోరారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!