ఉప్పొంగిన గోదావరి ప్రవాహంలో మెండోరా మండలం సావెల్ గ్రామ శివారులో సాంబయ్య ఆశ్రమంలో చిక్కుకుపోయిన బాధితులను అధికారులు ఒడ్డుకు క్షేమంగా చేర్చారు.
మధ్యాహ్నం ఎస్సారెస్పీ 40 గేట్లను ఎత్తివేసిన అధికారులు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జారీ చేసినప్పటికీ, సావెల్ గోదావరి వద్ద కుర్రులో పశువుల కాపరులతోపాటు పూజారి చిక్కుకుపోయారు.
వారి ఆర్తనాధాలను విన్న స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో, రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వరదలు చిక్కుకుపోయిన బాధితులను ఒడ్డుకు క్షేమంగా చేర్చారు. దీంతో కథ సుఖాంతం అయింది.
