ఉరి వేసుకుని మహిళ ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని రెండవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది..స్థానికుల సమాచారం మేరకు నగరంలోని దోబిగల్లి కి చెందిన సరస్వతి(33).
గత కొన్ని సంవత్సరాలుగా తరుచూ మూర్ఛ వ్యాధి, అనారోగ్యం తో బదపడుతున్నట్లు తెలిపారు.అలాగే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు తీవ్ర మనస్థాపానికి గురై సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్నట్లు తెలిపారు.
స్థానికుల గమనించి భర్త అయిన నరేష్ కు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న నరేష్ హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
