మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసిన వ్యక్తికి జిల్లా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు రోజులు శిక్ష విధించినట్లు మూడవ టౌన్ ఎస్ఐ మహేష్ కుమార్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే నగరంలోని గౌతమ్ నగర్ కు చెందిన రాజేష్ ఈ నెల 8న మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేశాడు. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టగా జిల్లా సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ రెండు రోజులు శిక్ష విధించారు.
డయల్ 100ను అత్యవసర సమయంలో మాత్రమే ఉపయోగించుకోవాలని పోలీసులు సూచించారు.
