యాసిడ్ తాగి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నగరంలోని రూరల్ మండలంలోని చోటు చేసుకుంది. ఎస్ఐ అరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం..
నగరంలోని రామ్ నగర్ కు చెందిన షేక్ బాజీ(54). గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై పనులు చేయకుండా తిరగడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో ఈ నెల 14 న ఇంట్లో యాసిడ్ తాగి ఆత్మ హత్య కు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బుదవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
కుటుంబ సభ్యుల ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆరీఫ్ తెలిపారు.
