ప్రమాదవశాత్తు నీటి కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన రూరల్ మండలంలో బుదవారం చోటు చేసుకుంది. ఎస్ఐ ఆరీఫ్ తెలిపిన వివరాల ప్రకారం..
రూరల్ మండలంలోని మాల్కాపూర్ గ్రామానికి చెందిన పెద్దోళ్ల లక్ష్మణ్(54). బుదవారం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ శివారులో కెనాల్ కి వెళ్ళారు.
ఈ మేరకు కాలకృత్యాల అనంతరం కాలువలోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు కాలు జారీ నీటిలో మునిగాడు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి ఎంత గాలించినా లభ్యం కాకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెతికి తీసి పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
