గోదావరి బ్యాక్ వాటర్ లో పడి వ్యక్తి ఆత్మ హత్య చేసుకున్న ఘటన నందిపేట్ మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.నందిపేట్ మండలంలోనీ కుదన్పూర్ గ్రామానికి చెందిన మేతరి అశోక్(40). ఈ నెల 18 న పనులు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.
ఆదివారం నందిపేట్ మండలంలోనీ వన్నెల్ (కె), మారంపల్లీ మధ్య గల గోదావరి బ్యాక్ వాటర్ లో శవమై కనిపించాడు.స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
