బాసర ఆర్జీయూకేటీ చీఫ్ సెక్యూరిటీ అధికారిగా కామారెడ్డి కి చెందిన డాక్టర్ డి.రాజేశ్ బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. 1996 బ్యాచ్ కు చెందిన ఆయన మొన్నటి దాక మెదక్ డిఎస్పీ గా పనిచేసారు. గతంలో ఆయన ఎస్సై గా సీఐ నిజామాబాద్ జిల్లాలో పనిచేసారు.
పనిచేసి ప్రస్తుతం ఆర్జీయూకేటీ బాసరకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమితులయ్యారు.ఈ మేరకు ఆయన బాధ్యతలు చేపట్టారు. సీఐ గా ఉన్న రాకేష్ ను అక్కడి సెక్యూరిటీ బాధ్యతల నుంచి తప్పించారు. యునివర్సిటీ ఏర్పాటు అయ్యాక మొదటి సారిగా డిఎస్పీ స్థాయి అధికారి నియామకం జరిగింది.
అనేక సబ్జెక్ట్ లలో రాజేష్ పీజీ లు చేసి తెలంగాణ యునివర్సిటీ నుంచి డాక్టరేట్ సైతం పొందారు. ఆయన అనేక సామజిక అంశాల మీద కవిత్వాలు సైతం రాస్తారు. సోషియల్ మీడియాలో ను యాక్టివ్ గా వుంటారు.సామజిక రుగ్మతుల మీద మంచి అవగాహనఉంది
