HomeCRIMEరోడ్డు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి మురహరిపల్లి సమీపంలో ఘోర రోడ్డు...

రోడ్డు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి మురహరిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారి ఫై బుధవారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా, మరో బాలుడు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.

హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ (TG05T9635) ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.ప్రమాదంలో కారును నడుపుతున్న చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు.

తీవ్రంగా గాయపడిన ఆయన భార్య రేఖ, కుమారుడు లోహిత్ (7), రేఖ సోదరి కుమారుడు నిహాల్ (2)లను స్థానికులు వెంటనే ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రేఖ, నిహాల్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఎముకలకు తీవ్ర గాయాలైన లోహిత్‌కు చికిత్స కొనసాగుతోంది.ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments