ప్రజలకు మరింత మెరుగైన అత్యవసర వైద్య సేవలను అందించేందుకు 108 అంబులెన్స్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణ తరగతులు జిల్లా కేంద్రంలో విజయవంతంగా ముగిశాయి.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్, నిర్మల్ జిల్లాల ప్రోగ్రాం మేనేజర్ పి.జనార్ధన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిక్షణలో భాగంగా అత్యవసర వైద్య సేవలు, శిశు సంరక్షణ, సీపీఆర్ , ప్రథమ చికిత్స, ప్రమాద బాధితులకు తక్షణమే అందించాల్సిన వైద్య సాయం తదితర అంశాలపై నిపుణులు సిబ్బందికి ప్రాక్టికల్ డెమోతో అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో బాధితులకు ప్రాణాపాయం తప్పించేలా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఆధునిక వైద్య విధానాలపై పట్టు సాధించి, బాధితులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ శిక్షణను నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఇన్స్ట్రక్టర్ ప్రమోద్, నిజామాబాద్ జిల్లా కో-ఆర్డినేటర్ స్వరాజ్, కామారెడ్డి జిల్లా కో-ఆర్డినేటర్ తిరుపతి, సిబ్బంది సంతోష్ రెడ్డి, శేఖర్ గౌడ్, లక్ష్మణ్, హఫీజ్, శ్రీనివాస్, కిషన్, విజయ్, అరుణ్, భీంరావ్, రూపేష్, అకేశ్, రాజు తదితరులు పాల్గొన్నారు.
