తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ మెయిన్ గేట్ ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అదానీ రేవంత్ రెడ్డి బొమ్మలతో కూడిన టీషర్ట్లను ధరించి అసెంబ్లీకి వచ్చారు. రేవంత్, అదాని దోస్తానా..
ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ తల్లి మాది.. స్పీకర్ డౌన్ డౌన్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, టీషర్టులు విప్పేసి లోనికి వెళ్లాలని వారు సూచించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు..
