హైదారాబాద్ లో ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ భవనం మీద నుంచి దూకి విద్యార్థిని ఆత్మ హత్య కు పాల్పడింది పెండ్లి అయిన 20 రోజులకే ఈ ఘాతుకాని పాల్పడడం గమనార్హం
యాదాద్రి జిల్లా మెటా కొండూరు మండలం కాటేపల్లి కి చెందిన పల్లవి ఘనపూర్ లో కేపీటీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ లో సి యస్ ఈ మూడో ఏడాది చదువుతుంది ఆగస్టు 30 ఆమె ను హైదారాబాద్ చైతన్య పూరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ కు ఇచ్చి అన్ని లాంచనాలతో అంగరంగ వైభవంగా పెండ్లి చేశారు.
కాలేజీ కి వెళ్తున్నానని వెళ్లిన పల్లవి అనూహ్యంగా ఆత్మ హత్య చేసుకుంది భర్త శ్రీకాంత్ అదనపు కట్నం కోసం వేధించడం వల్లే తమ కూతురు ఆత్మ హత్య చేసుకుందని మృతురాలి తండ్రి మధుసూదన్ పోలీసులకు పిర్యాదు చేసారు ఘటకేసర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు
