Saturday, May 2, 2026
HomeLaw and Orderరక్తదానం మహత్తర సేవ..పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..

రక్తదానం మహత్తర సేవ..పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..

పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుదవారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు కమిషనర్ సాయి చైతన్య పాల్గొని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశం, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మా అమర వీరుల త్యాగాన్ని స్మరించుకుంటూ, సమాజ సేవలో భాగంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రక్తదానం ద్వారా ప్రాణాలను కాపాడటం కూడా ఒక మహత్తర సేవ” అన్నారు. రక్త దాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు హెల్మెట్ లు, జ్యూస్ అరటి పండ్ల అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏసిపి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ఏ ఆర్ అడిషనల్ డీసీపీ రామచందర్ రావు, అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!