కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఎంసిఎచ్ ఆస్పత్రిలో డెంగ్యూ తో బాధపడుతూ ఓ బాలుడు మృతి చెందిన ఘటన బాన్సువాడ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో మంగళవారం చోటుచేసుకుంది.
పిట్లం మండలం కాటేపల్లి గ్రామానికి చెందిన శంకర్, కృష్ణవేణి దంపతుల కుమారుడు హేమంత్(3)కు తీవ్ర మైన చలి జ్వరం రావడంతో సోమవారం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు.
కేవలం గ్లూకోజ్ పెట్టి వదిలేశారని, ఎలాంటి ట్రీట్మెంట్ చేయలేదని తండ్రి ఆరోపించారు.రాత్రి వైద్యులెవరు పట్టించుకోకపోవడంతో మంగళవారం ఉదయం పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లామన్నారు.
అప్పటికే బాలుడు మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు.