HomeLaw and Orderమున్సిపల్ డివిజన్లలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ..పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ఆరా..

మున్సిపల్ డివిజన్లలో కమిషనర్ ఆకస్మిక తనిఖీ..పారిశుధ్యం, తాగునీటి సరఫరాపై ఆరా..

ప్రభుత్వ స్థలాల రక్షణకు ఆదేశం నగరంలోని పలు డివిజన్లలో మున్సిపల్ కమిషనర్ గురువారం ఆకస్మికంగా పర్యటించారు. ముఖ్యంగా 41, 12వ డివిజన్లలో పర్యటించిన ఆయన, క్షేత్రస్థాయిలో అందుతున్న పౌర సేవలను స్వయంగా పరిశీలించారు.

పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ప్రభుత్వ భూముల రక్షణే ధ్యేయంగా ఈ తనిఖీలు సాగాయి. తొలుత డివిజన్లలో పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించిన కమిషనర్, చెత్త సేకరణ, డ్రైనేజీల నిర్వహణపై సిబ్బందికి పలు సూచనలు చేశారు.

వీధులు శుభ్రంగా ఉండాలని, ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా చూడాలని శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా దోమల నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రజలకు అందుతున్న తాగునీటి సరఫరాపై కమిషనర్ ఆరా తీశారు. నీటి వృధాను అరికట్టాలని, పైపులైన్ల లీకేజీలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments