మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లోకాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యురాలుగా నామినేషన్ వేసిన మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడంపై నిజామాబాద్ జిల్లా మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ బిజెపి పై మండిపడ్డాడు.
సంబంధం లేని కేసులు ఎరగా చూపి ఆమె యొక్క నామినేషన్లు తిరస్కరించడం పై తీవ్రంగా మండిపడ్డాడు. విద్యావేత్త అయినటువంటి ఆమె రాజకీయ జీవితంలో ఎటువంటి కరప్షన్ లేకుండా గాంధీయవాదిగా ప్రజలకు సేవ చేస్తూ తన రాజకీయ జీవితాన్ని ఎటువంటి మచ్చ లేకుండా రాజకీయాల్లో ముందుకు వెళుతున్న మీనాక్షి నటరాజన్ ను కావాలని మోడీ ప్రభుత్వం ఒక కేసును ఎరగా చూపి ఆమె యొక్క నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటని ఆయన అన్నారు
దీనిపై సత్వరం ఎలక్షన్ కమిషనర్ గారు చొరవ తీసుకొని ఆమెకు న్యాయం చేయాలని ధర్మపురి సంజయ్ అన్నారు.
