HomeTelanganaNizamabadకందకుర్తి వద్ద పరవల్లు తొక్కుతున్న గోదావరిగోదావరిలో నీట మునుగుతున్న శివాలయం

కందకుర్తి వద్ద పరవల్లు తొక్కుతున్న గోదావరిగోదావరిలో నీట మునుగుతున్న శివాలయం

ఎగువ గోదావరి లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కందకుర్తి త్రివేణి సంగమం వద్ద గోదావరి నిండుకుండలా మారింది .

ఈ వర్షాకాలం తొలిసారిగా గోదావరిలో నిండుగా నీరు ప్రవహిస్తున్నది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్నటువంటి వర్షాలకు సైతం వాగుల్లోని వంకలో నీరు మొత్తము మంజీరా, హరిద్ర, గోదావరిలో నీరు చేరి నిండుగా ప్రవహిస్తున్నది.

గోదావరిలో ఉన్నటువంటి పాత శివాలయం చుట్టూ నీరు ప్రవహిస్తూ గంటగంటకు గోదావరి నీటిలో మునుగుతున్నది .ఉదయం నుండి గోదావరిలో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో పాత శివాలయము నీటిలో మునుగుతున్నది .

గోదావరి చుట్టు ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. గోదావరి నిండుగా ప్రవహిస్తున్నది కావున గోదావరి తీర ప్రాంతానికి వ్యవసాయం కోసం కానీ పశువుల మేత కోసం కానీ వెళ్ళకూడదని తాసిల్దార్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments