ఆర్థిక ఇబ్బందులు తాళలేక భార్యాభర్తలు ఆత్మహత్య కు పాల్పడిన ఘటన రాజంపేట మండలం శివాయిపల్లిలో జరిగింది.లింగంపేట్ మండలం కొర్పోల్కు చెందిన గంగారాం, ప్రభాకర్ వద్ద వ్యవసాయ పొలం పనులు చేయడానికి జీతం ఉన్నాడు.
ఆర్థిక విషయాల్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సోమవారం కోపంలో దంపతులు పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
వారిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందారు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
