కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో పాము కలకలం రేపింది.పదవ తరగతి విద్యార్థిని మంగళవారం ఉదయం పాము కాటు వేసింది. దీంతో విద్యార్థిని హుటాహుటిన జీజీహెచ్ కు తరలించగా అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు.
కామారెడ్డి మండలం సారంపల్లి శివారులోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలలో గాంధారి మండలం జెమినీ తండాకు చెందిన బానోత్ చరణ్ పదవ తరగతి విద్యార్థి చదువుతున్నాడు. అయితే రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం ఉపాధ్యాయులు విద్యార్థులకు టీ బ్రేక్ ఇచ్చారు.
దీంతో చరణ్ పాఠశాల మైదానంలోకి రాగానే ఎడమ కాలు పాదం పైన పాము కాటు వేసింది. గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు.ఆయన ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు
