నిజామాబాద్ టీఎన్జీవోఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఎనిమిదేళ్లపాటు కొనసాగిన అలుక కిషన్ తన పదవికి రాజీనామా చేశారు. ల్యాండ్ సర్వే డిపార్ట్ మెంట్ లో ఉన్న ఆయనకు ఇటీవలే పదోన్నతి వచ్చింది.
గెజిటెడ్ హోదా లో వుంటే టీఎన్జీవోస్ బైలా ప్రకారం సభ్యత్వం కోల్పోతారు. అందుకే కిషన్ జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు సమాచారం .
ఇటీవల జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన తన రాజీనామాను సమర్పించారు.
