కామారెడ్డి జిల్లా లో చిరుత పులి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది . జుక్కల్ మండలం మంగళవారం తెల్లవారుజామున పంట పొలాల వైపు వెళ్లిన స్థానికులు,మృతి చెంది ఉన్న చిరుతను గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న వెంటనే అటవీ అధికారులు, పశువైద్యాధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతి చెందిన చిరుత వయస్సు ఎక్కువగా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు.సాధారణంగా ఆ ప్రాంతం దట్టమైన అడవి కాకపోయినప్పటికీ, చిరుత మృతదేహం అక్కడ కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.
