ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన జక్రాన్ పల్లి మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే కేశ్ పల్లి గ్రామానికి చెందిన సోలం గంగాధర్ ( 35 ) అనే మృతుడు గంగాధర్ తన ద్విచక్ర వాహనం ( ఏ.పి .25 ఏ.కె .5373 ) పై ఆర్మూర్ నుండి తొర్లికొండ గ్రామానికి వెళుతున్న క్రమంలో జాతీయ రహదారి 44 పై ఆల్ ఫోర్స్ పాఠశాల టర్నింగ్ వద్ద ట్రాక్టర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుడు కూలి పని చేసుకొని జీవనం సాగిస్తాడు . మృతునికి ఇద్దరు కుమారులు కలరు . సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై ఇంద్రకరణ్ రెడ్డి మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు ట్రాక్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి , మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
