రైలు నుంచి కింద వ్యక్తి దుర్మరణం చెందాడు.ఈఘటన నగరంలోని రైల్వే స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జనకంపేట్ రైల్వే స్టేషన్ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రయాణిస్తున్న రైలు నుంచి జారీ కింద పడి మృతి చెందినట్లు వైద్యులు.మృతుని వయస్సు సుమారు 25-30 సంవత్సారాలు ఉంటుందని తెలిపారు.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
మృతుని వివరాలు తెలిసిన వారు రైల్వే ఎస్ఐ 8712658591 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
