.పెళ్ళికోసమని అప్పు చేసిన సుమారు రూ. 4 లక్షలు నగదు, 3 తులాల బంగారం చోరి.నగరంలో తాళం వేసిన ఇంట్లో చోరి జరిగింది. ఈ ఘటనలో ఒకటవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే..
నగరంలోని హాబీబ్ నగర్ కాలానికి చెందిన హమీద్ కుటుంబ సభ్యులతో శుక్రవారం మధ్యాహ్నం నాందేడ్ లో ఉంటున్న బందువుల పెళ్లికి వెళ్లినట్లు తెలుస్తోంది.
ఈ మేరకు గమనించిన గుర్తు తెలియని దుండగులు, హమీద్ ఇంట్లో వచ్చే నెలలో పెళ్లి కోసమని అప్పు చేసిన తీసుకొచ్చిన సుమారు రూ. 4 లక్షలు నగదు, 3 తులాల బంగారం శుక్రవారం రాత్రి ఇంటి తాళం తీసి ఇంట్లొకి చొరబడి బీరువా నుంచి అపహరించినాట్లు తెలిపారు.
ఈ మేరకు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ ద్వారా ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.
