పేకాట స్థావరం పై సీసీఎస్ పోలీసులు దాడి చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆదివారం ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్ , ఎస్.ఐ గోవింద్, సిబ్బందితో కలిసి నిజామాబాద్ టౌన్ 4 పోలీస్ స్టేషన్ పరిధిలోని తిరుమల టాకీస్ రోడ్డు దగ్గరలో ఉన్న ఒక గదిలో పేకాట స్థావరం పై రైడ్ చేసి నలుగురి పేకాట రాయుళ్ళును అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
వారి నుంచి రూ 10,350 నగదు, (4) సెల్ ఫోన్స్ లను స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం టౌన్ 4 పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు తెలిపారు.
