కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం గత మూడు రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాన్సువాడ పట్టణం లోని పలు కాలనీలలో పర్యటించిన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బాన్సువాడ పట్టణ కేంద్రంలోని పలు వార్డులలో పర్యటించి ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని
సంబంధిత అధికారులకు,ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు భారీ వర్షాల నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.నదులు,వాగులు,చెరువులు, కల్వర్టులు,బ్రిడ్జిల దగ్గరకు వెళ్ళవద్దు.అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి కరంటు స్తంభాలు,వైర్లను ముట్టుకోవద్దు.
చిన్న పిల్లలను ఇంట్లోనే ఉంచండి,బయటకు రానివ్వద్దు మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్,ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు,నాయకులు అధికారులు పాల్గొన్నారు.
