నిజామాబాద్ :
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టీయుడబ్ల్యూజె – ఐజెయు) అనుబంధంగా పనిచేస్తున్న జర్నలిస్టులపై దాడుల నివారణ (రక్షణ) కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా టీయుడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బొబ్బిలి నర్సయ్యను ఎంపిక చేయడంపై నిజామాబాద్ జిల్లా కమిటీ సంతోషం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయిలో జిల్లాకు ప్రాధాన్యత ఇచ్చిన రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సీనియర్ జర్నలిస్టు,
యూనియన్ రాష్ట్ర నాయకుడు బొబ్బిలి నర్సయ్యకు అవకాశం కల్పించడంపై ఆనందం వ్యక్తం చేసినట్లు జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, జిల్లా కార్యదర్శి అరవింద్ బాలాజీ,
కోశాధికారి సిరిగాద ప్రసాద్, ఆర్గనైజేషన్ కార్యదర్శి సంజీవ రెడ్డిలతో పాటు జిల్లా కమిటీ సంతోషం వ్యక్తం చేశారు.
