పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసుల దాడులు తొమ్మిది మందిని పట్టుకున్నట్లు దర్పల్లి ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
వివరాల్లోకి వెళితే… దర్పల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు దాడి నిర్వహించి 9మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
వారినుంచి రూ. 12040 నగదు,9సెల్ ఫోన్లు,6ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.వారిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.
