నిజామాబాద్ నగరానికి చెందిన ఓ మహిళా తన గోడు వినిపించుకోవడానికి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వచ్చింది.
ఆ సమయంలో అప్పుడే అటువైపు నుంచి పోలీస్ కార్యాలయానికి వస్తున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, సదరు మహిళా ఫిర్యాదురాలిని చూసి తన కారులో నుంచి దిగి త్వరితగతిన అట్టి మహిళా ఫిర్యాదుదారురాలు వద్దకు వెళ్లి అట్టి ఫిర్యాదును తీసుకొని ఆమె సమస్యను క్షుణ్ణంగా వినడం జరిగింది.
ఆ మహిళ ఫిర్యాది పేరు భామని సవిత , టౌన్ – 2 పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన తెలిపినది.
తన భర్త వేధింపులు, అదనపు కట్నం కోసం భర్త వేధిస్తున్నాడు సిపి కి చెప్పడంతో ఫిర్యాదిరాలి సమస్యని త్వరితగతిన పరిష్కరించాలని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ఓకు ఆదేశాలు జారీ చేశారు.
