హమల్వాడికి చెందిన సర్దార్ 60 వృద్ధుడు ఈ నెల2 న కామారెడ్డి వెళ్లడానికి కంటేశ్వర్ లో గల తేనె సాయిబాబా మందిరం ముందు బస్సు కోసం ఎదురు చూస్తూ ఉండగా, ఆటో లో వచ్చిన ముగ్గురు సినిమా పక్కి తమ ఆటో రిక్ష లో తీసుకెళ్లారు అతని వద్ద నుండి రూ 5550 నగదుతో పాటు ఒక మొబైల్ ఫోన్ ని లాక్కొని సర్దార్ ని కంటేశ్వర్ లో దింపేసి అదే ఆటో లోనే పారిపోయారు బాధితుడు .
మాలోత్ సర్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేసారు దోపిడీ కి పాల్పడిన ముగ్గురు ని గుర్తించారు వారిని శుక్రవారం గురు బాబాది రోడ్లో పట్టుకొని వారి పేర్లు విచారించారు.
నాందే డ్ చెందిన బషీర్ వా 2.న నిజామాబాద్ కి వచ్చి నిజామాబాదులో తన మిత్రులైన షేక్ అలీమ్ మరియు ఖాదర్ ని కలిసి, షేక్ ఖాదర్ యొక్క ఆటోలో తిరుగుతూ ముసలి వాళ్లు మరియు అమాయకులను టార్గెట్ చేసి వారి వద్ద నుండి బంగారం లేదా డబ్బులు గుంజుకోవాలని పథకం వేసుకున్నరు.
ఇందులో భాగంగానే మాలోత్ సర్దార్ అనే వృద్ధుడు వద్ద నుండి 5500 నగదు మరియు సెల్ ఫోన్ లాక్కున్నారు. నేరం ఒప్పుకున్నందున వారి వద్ద నుండి 2500 రూపాయలు,మరియు నేరానికి ఉపయోగించిన ఆటో ని స్వాధీనం చేసుకున్నారు
