బిహార్లోని బంకీపూర్ శాసనసభ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ (PK) సంచలన విజయం సాధించారు. బీజేపీ కి గత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో పీకే గెలుపు జెండా ఎగరేశారు.
ప్రశాంత్ కిశోర్ తన సమీప బీజేపీ అభ్యర్థి నీరజ్ సిన్హాపై 18,953 ఓట్ల భారీ తేడాతో ఘన విజయం సాధించాపీకేకు 63,203 పోలయ్యాయి. అలానే రెండో స్థానంలో నిలిచిన బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ కు 44,250, మూడో స్థానంలో నిలిచిన ఆర్జేడీ అభ్యర్థి రేఖ కుమారి 14,085 ఓట్లు సాధించారు.
ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ.. తన గెలుపు బీజేపీ హైకమాండ్కు ఒక బలమైన సందేశమని వ్యాఖ్యానించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తిని బిహార్ ముఖ్యమంత్రిగా చేశారని తీవ్రస్థాయిలో మండిపడిన ఆయన, సామ్రాట్ చౌదరిని వెంటనే సీఎం పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
