ఇటీవల కారు ప్రమాదానికి గురైన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ని మాజీ మంత్రి, వేముల ప్రశాంత్ రెడ్డి సోమవారం పరామర్శించారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ప్రశాంత్ రెడ్డి , ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడడం సంతోషకర విషయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
