తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు గా R.మల్లేష్ నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం ఫౌండర్ కోడూరు ప్రకాష్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.నిజామాబాద్ జిల్లా అధ్యక్షులైన J. శివాజీ గణేష్ AAO గా ప్రమోషన్ అయినందున R.మల్లేష్ ను అధ్యక్షులుగా నియమించారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యుల కు ఎలాంటి సమస్య రాకుండా సమర్థవంతమైన నాయకత్వాన్ని అందిస్తూ కార్మికులకు అన్నింటా మేము మీకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి M. రాజేందర్.గారి నాయకత్వన నిజామాబాద్ జిల్లా వివిధ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శుల పాల్గొన్నారు.
