డిచ్పల్లి మండలం ఘన్పూర్ సమీపంలోని ఎల్సీ గేట్ నంబరు 196ను రెండు రోజులపాటు తాత్కాలికంగా మూసివేయనున్నారు.
డబుల్ లైన్ ఏర్పాటుతోపాటు ట్రాక్ లింకింగ్ పనులు చేపడుతున్నందున ఈ నెల 22న ఉదయం 8 గంటల నుంచి 24న ఉదయం 8 గంటల వరకు గేట్ను మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే నిర్మాణ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రసాద్ తెలిపారు.
వాహనదారులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించాలని కోరారు.
