నగరంలో ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, నిజామాబాద్ టౌన్ ఏసీపీ ప్రకాష్ శుక్రవారం పలు నామినేషన్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు.
ఇందులో భాగంగా కంటేశ్వర్, గుపన్ పల్లి ప్రాంతంలోని రెండు నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.ఈ సందర్భంగా ఏసీపీ ప్రకాష్ మాట్లాడుతూ.. నామినేషన్ల పర్వం ప్రశాంతంగా సాగేలా అన్ని కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
