నిజామాబాద్ కాకతీయ స్కూల్ భవనం పై నుంచి దూకి విద్యార్థి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు.ఈ ఘటన నగరంలోని నాలుగవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే..నిజామాబాద్ కాకతీయ పాఠశాలలతో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీకి పాల్పడుతూ క్లాస్ టీచర్ కు దొరకడంతో ప్రినిపాల్ దగ్గరకు తీసుకెళ్లినట్లు తెలిపారు.
దీంతో ప్రిన్సిపాల్ మందలించి, తల్లిదండ్రులకు తెలపడంతో మనస్థాపానికి గురై ఆదివారం కాకతీయ స్కూల్ రెండవ అంతస్తు నుంచి కిందకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి.
వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
