నిత్యం ప్రయాణీకుల రద్దీతో కళకళలాడుతున్న నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఓ వ్యక్తి చోరీకి పాల్ప డ్డాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చోరీలకు పాల్పడుతున్న నింది తుడు పోలీసుల చేతికి చిక్కాడు.
దీంతో ఆ నిందితుడి వద్ద మూడు సెల్ ఫోన్లు లభ్యమవ్వడంతో పోలీసులు అతన్ని పట్టుకొని విచారించారినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు.
ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రైల్వే స్టేష న్లో శనివారం ఉదయం ఓ వ్యక్తి అనుమానాస్పదంగా రైల్వే స్టేషన్లో తిరుగుతున్నాడనీ, ఆ వ్యక్తిని పట్టుకొని విచారించి తనిఖీలు చేయగా అతను నగరంలోని ద్వారకానగర్ కు చెందిన మజీద్ అనే వ్యక్తి దగ్గర మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
దీంతో పోలీసులు అతనిని విచారించగా రైల్వేలో ప్రయాణిస్తున్న వ్యక్తుల దగ్గర నుండి ఫోన్లు దొంగతనం చేశానని ఆ వ్యక్తి ఒప్పు కొన్నాడని పోలీసులు తెలిపారు. అలాగే రోజువారీగా దొంగతనికి వచ్చినట్లు ఒప్పుకున్నాడని తెలిపారు.
ఈ మేరకు నిధుతుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. ఈ తనిఖీలో హనుమాన్లు, గురుదాస్, రాములు సిబ్బందిని అభినందించారు.
